‘సుక్కేస్తే అందరూ సుట్టాలే’

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా విడుదలైన సినిమాలే మంచి విజయం సాధించడమే కాకుండా కథ, కథనం పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇటీవలే విడుదలై భారీ విజయం సాధించిన బలగం, రైటర్​ పద్మభూషణ్​ సినిమాలే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక, రైటర్ పద్మభూషణ్ సినిమా నిర్మించిన లహరి ఫిలిమ్స్ చాయి బిస్కెట్ ఫిలిమ్స్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘మేం ఫేమస్’ అనే సినిమాతో మరోసారి చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ సంస్థ తెలుగు ప్రేక్షకుల అలరించేందుకు వచ్చేస్తోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్​. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదగా విడుదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సుమంత్ ప్రభాస్ అనే ఒక సోషల్ మీడియా స్టార్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ సినిమాలో మణి, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి కీలకపాత్రలో నటించారు.

సుమంత్ ప్రభాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అనురాగ్ రెడ్డి శరత్ చంద్ర మనోహరం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత ఊర్లో పని పాట లేకుండా గాలికి తిరిగే ముగ్గురు కుర్రవాళ్ళ కథతో ఈ సినిమా రూపొందించినట్లుగా కనిపిస్తోంది. ఊరిలోనే ఉంటూ జీవితాన్ని ఏమాత్రం సీరియస్ గా తీసుకోకుండా ఎంజాయ్ చేస్తూ తల్లిదండ్రుల చేత తిట్లు తింటూ ఫేమస్ అవ్వడానికి ప్రయత్నించే వారిగా కనిపిస్తున్నారు. వారు ఊరిలో ఫేమస్ కాదు కానీ ఫేమస్ అవుతాం మేము ఫేమస్ అంటూ ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా టాన్ జీన్స్ ఎపిసోడ్ మాత్రం నవ్వులు పూజిస్తుంది. అలాగే దినం గురించి డీజే టిల్లు సేమ్ మురళీధర్ చెబుతున్న డైలాగు కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ నేపథ్యం, యాసలో ఉన్న ఈ సినిమాలో ‘సుక్కేస్తే అందరూ సుట్టాలే… ’, ‘దినాల్దేముంది.. ధూం ధాం కావాలెగానీ.. ఓ దినం అటో ఇటో’ అంటూ సాగే డైలాగ్స్​ ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా జూన్​ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.