నా బిడ్డ‌కు అవార్డు ఇవ్వ‌లేదు.. RRRకు ఆస్కార్ వ‌చ్చినందుకు సంతోష‌మే

RRR సినిమాలోని నాటు నాటు పాట‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్ అవార్డు రావ‌డంపై స్పందించారు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. “ఒకప్పుడు నేను చేసిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు నంది అవార్డు రావాల‌ని రిజిస్ట‌ర్ చేసుకున్నాను. కానీ నాకు రానివ్వ‌కుండా ప‌నికిమాలిన చెత్త సినిమాల‌కు ఇచ్చేవారు. అది చూసి నేను న‌వ్వుకునేవాడిని. ఎవ‌రు అలా చేయిస్తున్నారో తెలిసి వారికి ఫోన్ చేసి అడిగేవాడిని. నేను పెద్ద‌వాడిని నాతో అలా మాట్లాడ‌కు అనేవారు. ఆ త‌ర్వాత నా కొడుకు మంచు మ‌నోజ్ నేను నటించిన ఝుమ్మంది నాదంలోని ఓ పాట చాలా హిట్ అయింది. ప్ర‌తి స్కూల్‌లో ఆ పాట వినిపించాలి. ఆ పాట‌కు నంది ఇస్తార‌నుకున్నా కానీ నా బిడ్డ‌కు ద‌క్క‌నివ్వ‌కుండా వేరొక‌రికి ఇచ్చారు. కాబ‌ట్టి ఈ అవార్డుల గురించి నేను పెద్ద‌గా ప‌ట్టించుకోను. నాకు కావాల్సింది ప్రేక్ష‌కుల అభిమానం, నేను పెట్టిన డబ్బుకు ప్ర‌తిఫ‌లం. అంత‌కుమించి ఎక్కువ ఆలోచించ‌ను. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ రావ‌డం నిజంగా ఓ తెలుగువాడిగా ఎంతో గ‌ర్విస్తున్నాను. అప్ప‌ట్లో అన్న‌గారు ఎన్టీఆర్ నేను క‌లిసి చేసిన పుణ్య భూమి నా దేశం సినిమాలోని పాట త‌ర్వాత అంత‌టిస్థాయిలో గుర్తింపు ద‌క్కించుకున్న అచ్చ తెలుగు పాట ఏదైనా ఉందంటే అది నాటు నాటు. అలాంటి పాట‌లు మ‌రిన్ని రావాల‌ని కోరుకుంటున్నాను. ఇక‌పోతే నేను హీరోగా ఓ అద్భుత‌మైన క‌థ‌ను సిద్ధం చేసుకున్నాను. ఇందులో మీకు మ‌ళ్లీ నేను రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి రేంజ్‌లో క‌నిపిస్తాను. త్వ‌ర‌లో సినిమా వివ‌రాలు వెల్ల‌డిస్తాను. మా కుటుంబంపై వ‌స్తున్న ట్రోల్స్ గురించి చెప్పాలంటే.. అస‌లు నేను ప‌ట్టించుకోను. ఎవ‌రు చేయిస్తున్నారో తెలుసు. ఒక‌రికి హాని త‌ల‌పెట్టాల‌ని చూస్తే వాడే నాశ‌న‌మైపోతాడు. టైం వ‌చ్చిన‌ప్పుడు అనుభ‌విస్తారు” అని తెలిపారు మోహ‌న్‌బాబు.