Gurugram: ఆగిన నిశ్చితార్థం.. చంపేసిన వ‌రుడు

Gurugram: ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందన్న కోపంతో యువ‌తిని చంపేసాడు పెళ్లికొడుకు. ఈ ఘ‌ట‌న గురుగ్రామ్‌లో (gurugram) చోటుచేసుకుంది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని బ‌దావ్ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల‌ యువకుడికి 19 ఏళ్ల యువ‌తితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. కొన్ని నెల‌ల క్రిత‌మే వీరి నిశ్చితార్థం జ‌రిగింది. ఏం జ‌రిగిందో ఏమో.. కొన్ని రోజుల క్రితం నిశ్చితార్ధం ర‌ద్ద‌యింది. దాంతో ఆ యువ‌కుడు అమ్మాయిపై పీక‌ల‌దాకా కోపం పెంచుకున్నాడు. ఈరోజు మ‌ధ్యాహ్నం ఆ యువ‌తి త‌న ఫ్రెండ్‌తో క‌లిసి గురుగ్రామ్‌లో ప‌నికి వెళ్తుండ‌గా.. ఆ యువ‌కుడు మాట్లాడాలి అంటూ ఆపాడు. ఇక మాట్లాడేది ఏమీ లేదంటూ ఆ యువ‌తి చెప్తుండ‌గానే క‌త్తితో ప‌లుమార్లు పొడిచేసాడు. ప‌క్క‌నే ఉన్న ఫ్రెండ్ త‌ప్ప ఆ అమ్మాయిని కాపాడ‌టానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. అంద‌రూ అక్క‌డి నుంచి ప‌రుగులు తీసారు. ప్ర‌స్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.