స‌ల్మాన్, చ‌ర‌ణ్‌ “లుంగీ” డ్యాన్స్.. మాజీ క్రికెట‌ర్ ఆగ్ర‌హం

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ ప్రేక్ష‌కులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఫ‌ర్హ‌ద్ సంజీ తెర‌కెక్కించారు. ఇందులో స‌ల్మాన్‌తో పాటు విక్ట‌రీ వెంక‌టేష్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ న‌టించిన కాట‌మ‌రాయుడు సినిమాకు రీమేక్‌గా రాబోతోంది. అయితే ఇటీవ‌ల ఈ సినిమాలోని ఏంట‌మ్మా అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో స‌ల్మాన్, వెంక‌టేష్ ధోతీలు క‌ట్టుకుని డ్యాన్స్ చేస్తుంటారు. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా గెస్ట్ రోల్‌లో కనిపించి వారితో చిందులు వేసారు. అయితే ఈ పాట‌పై మాజీ క్రికెట‌ర్ అయిన ల‌క్ష్మ‌ణ్ శివ‌రామ‌కృష్ణన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఇందులో స‌ల్మాన్‌, వెంక‌టేష్, చ‌ర‌ణ్ ధోతీ క‌ట్టుకుని లోదుస్తులు క‌నిపించేలా వేసిన స్టెప్పుల‌పై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. ఈ పాట‌లోని డ్యాన్స్ చాలా ద‌రిద్రంగా ఉంది. ద‌క్షిణాది సంప్ర‌దాయాన్ని అవ‌మాన‌ప‌రిచారు. దీనిని లుంగీ అన‌రు. ధోతీ అంటారు. సంప్ర‌దాయ‌మైన వ‌స్త్రాన్ని క‌ట్టుకుని ద‌రిద్రంగా డ్యాన్సులు వేస్తున్నారు. లుంగీ అనేది రాత్రిళ్లు క‌ట్టుకుంటారు. ధోతీ పండుగ‌ల‌కు, ఏవైనా విశేషాల‌కు క‌ట్టుకుంటారు. అని ట్విట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. అయితే దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు స‌ల్మాన్, వెంక‌టేష్‌, రామ్ చ‌ర‌ణ్ ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. ఇక‌పోతే ఈ పాట‌లో స‌ల్మాన్ డ‌బ్బింగ్ కానీ, ధోతీ క‌ట్టుకుని వేసిన స్టెప్పులు కానీ న‌వ్వ‌కునే విధంగా వైర‌ల్ అవుతున్నాయి కానీ హైలైట్ అవడంలేదు. కొరియోగ్ర‌ఫీ ఇంకాస్త బాగుండి ఉంటే పాట వేరే లెవ‌ల్‌లో ఉండేది. ఇందులో స‌ల్మాన్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఏప్రిల్ 21న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.