రంగ‌మార్తాండ‌.. ఏడ్చేసిన చిరంజీవి

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన రంగ‌మార్తాండ సినిమా మంచి టాక్ అందుకుంటోంది. ప్ర‌కాశ్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా గ‌త వారం రిలీజ్ అయింది. న‌ట సామ్రాట్ అనే మ‌రాఠీ సినిమాకు దీనిని రీమేక్‌గా తెర‌కెక్కించారు. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూసార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. “రంగ‌మార్తాండ సినిమా చూసాను. ఈమ‌ధ్య‌కాలంలో నేను చూసిన సినిమాల్లోనే ది బెస్ట్ అని చెప్పుకోవ‌చ్చు. ప్ర‌తి ఆర్టిస్ట్‌కి త‌న జీవితాన్ని క‌ళ్ల‌ముందు చూసుకున్న‌ట్లు అనిపిస్తుంది. ఈ సినిమా ఓ త్రివేణీ సంగ‌మం అలా అనిపించింది. కృష్ణ‌వంశీ లాంటి ఒక క్రియేటివ్ డైరెక్ట‌ర్, ప్ర‌కాశ్ రాజ్ లాంటి జాతీయ ఉత్త‌మ న‌టుడు, హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందంల కాంబినేష‌న్, వారి ప‌నిత‌నం, ముఖ్యంగా ఆ ఇద్ద‌రు అద్భుత‌మైన న‌టుల న‌ట‌న ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. బ్ర‌హ్మానందం ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం ఇదే తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్ర‌య‌త్నంగానే క‌ళ్ల‌ల్లో నీళ్లు మెదిలాయి. ఓ కంప్లీట్ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అయిన ఇలాంటి సినిమాను అంద‌రూ చూసి ఆద‌రించాలి. ఇలాంటి ర‌స్త‌వ‌త్త‌ర‌మైన సినిమా తీసిన కృష్ణ‌వంశీకి, ప్ర‌కాశ్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, చిత్ర‌బృందానికి ధ‌న్య‌వాదాలు” అని తెలిపారు.