విశాఖ‌లో కూలిన భ‌వ‌నం: ముగ్గురి మృతి

విశాఖ‌ప‌ట్నంలోని జ‌గ‌దాంబ కూడ‌లి స‌మీపంలో మూడు అంత‌స్తుల భ‌వనం కుప్ప‌కూలింది. బుధ‌వారం అర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో బిహార్‌కు చెందిన చోటు అనే యువ‌కుడితో పాటు, అంజ‌లి, ఆమె సోద‌రుడు దుర్గాప్ర‌సాద్‌గా పోలీసులు గుర్తించారు. ప‌లువురికి గాయాల‌య్యాయి. ప్ర‌మాద స‌మ‌యంలో భ‌వ‌నంలో మొత్తం 8 మంది ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

పుట్టిన‌రోజు జ‌రుపుకున్న మ‌రుస‌టిరోజే..

విశాఖ‌కు చెందిన రామారావు, క‌ళ్యాణి దంప‌తుల‌కు అంజ‌లి, దుర్గా ప్ర‌సాద్ జ‌న్మించారు. నిన్న‌నే అంజలి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇంత‌లోనే త‌మ కూతురు ప్రాణాలు కోల్పోవ‌డంతో వారు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. కూతురు చ‌నిపోయిన కొన్ని గంట‌ల‌కే కొడుకు కూడా శిథిలాల కింద ప‌డి చనిపోయాడ‌ని తెలుసుకుని క‌న్న‌పేగు త‌ల్ల‌డిల్లిపోయింది.