రేపు విచారణకు హాజరు కాలేనన్న బండి సంజయ్!

మార్చి 15న విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. మార్చి 15న తాను విచారణకు హాజరుకాలేనని మహిళా కమిషన్​కు బండి సంజయ్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున మార్చి 15 కు బదులుగా మార్చి 18న కమిషన్ చెప్పిన సమయానికే హాజరవుతానని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే విచారణకు  తాను ఎందుకు హాజరుకావాలో మహిళా కమిషన్ వివరాలివ్వాలని కోరారు. అప్పుడే  తాను  వివరణ ఇచ్చేందుకు సులభం అవుతుందని  కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై  వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్  బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. మార్చి 15న కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్​ స్కాంలో కవిత ఈడీ విచారణను ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ బండి సంజయ్​ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.