Bandi Sanjay: పాతబస్తీ ఉగ్రవాదుల అడ్డా!

Hyderabad: పాత బస్తీ ఉగ్రవాదుల(Terrorists) అడ్డాగా మారిందనీ, మజ్లీస్(Majlis)​ ఉగ్రవాదులను పోషిస్తుందనీ ఆరోపించారు బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay)​. హైదరాబాద్ లో ఉంటూ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాల కింద యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు, తెలంగాణ ఇంటిలిజెంట్ పోలీసులు మంగళవారం రోజు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్​లో, హైదరాబాద్ లో ఏకకాలంలో సోదాలు జరిపారు. అనుమానిత ప్రాంతాలలో జరిపిన ఈ సోదాలలో భోపాల్​లో 11 మంది అరెస్ట్ కాగా.. హైదరాబాద్​లో ఐదుగురిని టెర్రరిస్టులుగా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​లో మరొక నిందితుడు పరారయ్యాడు.

అయితే నగరంలో ఉగ్ర కదలికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆరుగురు ఉగ్రవాదులు హైదరాబాద్ లో పట్టుబడ్డారని.. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అన్నారు. టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తానని గతంలో ఓవైసీ ప్రకటించారని.. ఉగ్రవాదులకు, రోహింగ్యాలకు మజిలీస్ ఆశ్రయమిస్తుందన్నారు. ఉగ్ర నేత ఓవైసీ కుటుంబానికి చెందిన దక్కన్ కాలేజీలో హెచ్వోడీగా పనిచేస్తున్నాడని ఆరోపించారు బండి సంజయ్.