వెబ్‌సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వ‌నున్న బాల‌య్య‌.. ఫ్యాన్స్​కి పూనకాలే!

నందమూరి నట సింహంగా నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు బాలకృష్ణ. కరోనాతో డీలా పడిపోయిన థియేటర్లకు ‘అఖండ’తో ఊపు తీసుకొచ్చి టాలీవుడ్​ని లాభాల బాట పట్టించిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. అంతేకాదు.. కరోనా సమయంలో ప్రేక్షకులంతా ఓటీటీకి అలవాటు పడిపోయారని గ్రహించిన బాలయ్య ఆహా వేదికగా అన్​స్టాపబుల్​ అంటూ ఇంటింటా చేరి ప్రేక్షకులను అలరించారు. నటుడిగానే కాదు వాఖ్యాతగానూ బాలయ్యకు ఎదురు లేదని ఈ షో రెండు సీజన్లు రికార్డు వ్యూస్​ సాధించి నిరూపించాయి. ఈ ఏడాదిని ‘వీరసింహా రెడ్డి’తో ఘనంగా ప్రారంభించిన బాలయ్య గురించి ఇండస్ట్రీ వర్గాల్లో మరో శుభవార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే వెబ్​ సిరీస్​ ద్వారా బాలకృష్ణ ఇంటింటా సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఆ వెబ్​సిరీస్​ని కూడా ఆహానే ప్లాన్​ చేస్తోందట.
తన సినీ ప్రయాణంలో సరికొత్తకోణాన్ని చూపించిన బాలయ్య హోస్ట్ గా ఎంతో సక్సెస్ అయ్యారు.ఇలా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న తరుణంలోనే ఈయన కమర్షియల్ యాడ్స్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా సమయంలో డిజిటల్ మీడియాకు మంచి ఆదరణ రావడంతో ఎంతోమంది సెలబ్రిటీలు వెబ్ సీరీస్ లో నటిస్తూ డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ సైతం డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న బాలకృష్ణతో ఒక వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో నిర్మాత అల్లు అరవింద్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇందుకు గాను బాలకృష్ణతో అల్లు అరవింద్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇందుకు గనుక బాలకృష్ణ ఓకే అంటే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనునట్లు తెలుస్తోంది. ఇక వీర సింహారెడ్డి విజయాన్ని ఆస్వాదిస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా NBK 108 వర్కింగ్​ టైటిల్​ షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్​ అనౌన్స్​మెంట్​, ఫస్ట్​గ్లింప్స్​ కోసం టాలీవుడ్​ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.