వ‌రుస ఫ్లాప్‌లు.. నేరుగా OTTలోకి స్టార్ హీరో సినిమా

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్. బాలీవుడ్​లో పెరిగిపోతున్నబాయ్​కాట్​ ట్రెండ్​తో స్టార్​ హీరోల సినిమాలన్నీ దారుణ ఫలితాలను చవి చూస్తున్నాయి. దాదాపు రెండేళ్లుగా సరైన హిట్​లేని బాలీవుడ్​కి షారూఖ్​ ఖాన్​ పఠాన్​తో కాస్త ఊరట లభించింది. అయితే మిగతా హీరోలందరి సినిమాలు కాస్త ఇబ్బందులనే ఎదుర్కొంటున్నాయి. ఇక, తన సినిమాలు థియేటర్ కు వర్కౌట్ కావని తెలిసిన సినిమాలను నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేలా నిర్మాతలను ప్రోత్సహిస్తున్నారు అక్షయ్​. తాజాగా అక్షయ్​ నటిస్తున్న ఓ మై గాడ్ 2 సినిమాను ఓటీటీ విడుదలకు ఫైనల్ చేశారట. మొదటి భాగం తెలుగులో వెంకటేష్–పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గోపాల గోపాలగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడలో ఉపేంద్ర–సుదీప్ నటించారు. అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది కానీ ఒరిజినల్ మాత్రం క్లాసిక్ అయ్యింది.

ఫస్ట్ పార్ట్ లో అక్షయ్–పరేష్ రావల్ నటన అద్భుతంగా ఉండటంతో పాటు అందులోని డ్రామా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఆ నమ్మకంతోనే రెండో భాగాన్ని మొదలుపెట్టారు. ఈసారి కృష్ణుడి పాత్రను శివుడిగా మార్చేశారు. కథ కూడా కొత్తదే. సీక్వెల్ కాదు. ఈ హక్కులను టైఅప్ తో ఒకే బ్రాండ్ గా మారబోతున్న జియో సినిమా ఊట్ లు సంయుక్తంగా కొనుగోలు చేశాయని ముంబై వర్గాల టాక్. ఎంత మొత్తానికి అనేది బయటికి రాలేదు కానీ చాలా క్రేజీ ఆఫర్ అయితే ఇచ్చారని తెలుస్తోంది. గతంలో అక్షయ్ కుమార్ కట్ పుత్లీ, లక్ష్మి బాంబ్, ఆత్ రంగీరే సినిమాలు కూడా నేరుగా స్మార్ట్ స్క్రీన్ పైనే రిలీజ్ అయ్యాయి.

ఈ లెక్కన ఇప్పుడీ సీక్వెల్ నిజంగా బాగున్నా రీమేక్ అవకాశాలు లేనట్టే. ఎందుకంటే నేరుగా యాప్ లో కోట్లాది ఆడియన్స్ చూసేస్తారు కాబట్టి ఎంతకాదనుకున్నా ఆసక్తి తగ్గిపోతుంది. ఓ మై గాడ్ 2 సినిమాపై ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందట. రెండు నెలల క్రితం అజయ్ దేవగణ్‌ థాంక్ యు గాడ్ వచ్చింది. అది ప్రేక్షకులను మెప్పించంలేకపోయింది. కథ పరంగా కొంచెం పోలికలు ఉండే అవకాశం ఉండటంతో ఫైనల్ గా ఓటీటీకే మొగ్గు చూపారని బాలీవుడ్​ ఇన్​సైడ్​ టాక్​.