ఐష్‌తో విడాకులు.. అభిషేక్ స్పంద‌న ఇదీ..!

బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్‌, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ విషయంపై అటు ఐశ్వర్యగానీ, ఇటు అభిషేక్​గానీ స్పందించకపోవడంతో వీరిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని అంతా అనుకుంటున్నారు. తాజాగా జరిగిన సంఘటన ఈ వార్తలకు ఊతం ఇచ్చినట్టయ్యింది. ఈమధ్య కాలంలో ముంబైలో జరిగే ఏ వేడుకకైనా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి హాజరవుతున్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఐశ్వర్య, అభిషేక్​ కలిసి ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. ఇటీవల ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్‌కు కూడా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో మాత్రమే కలిసి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అందువల్ల తాజాగా మరోసారి ఈ వార్తలు బాలీవుడ్లో టాక్ అఫ్ ది టౌన్​గా మారాయి. అయితే ఈ వార్తలన్నింటికీ ఒకే మెసేజ్​తో చెక్​ పెట్టారు అభిషేక్​ బచ్చన్​.

ముకేష్​ అంబానీ కల్చరల్​ సెంటర్​ లాంఛ్​ ఈవెంట్​లో ఐశ్వర్య ఒక్కరే కనిపించడంతో వీరిద్దరూ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, అందుకనే ఐశ్వర్య ప్రతి ఫంక్షన్ అభిషేక్ లేకుండా తన కూతురు ఆరాధ్యతో హాజరవుతుందని, ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకోవడంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఈ వార్తలు విన్న బచ్చన్ అభిమానులు చాలా బాధ పడ్డారు. తాజాగా ఈ వార్త పై అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చాడు. ఒక నెటిజెన్ ట్విట్టర్ వేదికగా.. ఐశ్వర్య, ఆరాధ్య కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ ‘నా ఫేవరెట్ పీపుల్’అంటూ కామెంట్ చేశారు. ఈ ట్వీట్​పై అభిషేక్ స్పందిస్తూ.. ‘నాకు కూడా వారిద్దరూ ఫేవరెట్ పీపుల్’ అంటూ రీ ట్వీట్ చేశాడు. అభిషేక్ రిప్లైతో విడాకుల వార్తలకు చెక్​ పెట్టినట్టయ్యింది. ఇక ఈ ట్వీట్ చూసిన బచ్చన్ అభిమానులు విడాకుల వార్తలన్నీ రూమర్సే అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండి జంటగా కనపడటం లేదని, దానికే ఇష్టమొచ్చినట్టు రూమర్స్​ క్రియేట్​ చేయడం అంత మంచిది కాదంటూ నెట్టింట చురకలు అంటిస్తున్నారు బచ్చన్​ అభిమానులు.