Palnadu: ప‌ల్నాడులో ఘోర యాక్సిడెంట్.. 5 మృతి

Palnadu: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని(ap) ప‌ల్నాడు(palnadu)లో  ఘోర రోడ్డు ప్ర‌మాదం(accident) చోటుచేసుకుంది. పొందుగుల గ్రామంలో ఆటోలో వెళ్తున్న వారిపైకి లారీ దూసుకెళ్ల‌డంతో తెలంగాణ‌కు చెందిన ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. న‌ల్గొండ జిల్లాకు వెళ్తున్న లారీ.. అదే జిల్లా నుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టింది. అయిన‌ప్ప‌టికీ డ్రైవ‌ర్ ఆగ‌కుండా వెళ్లిపోయాడు. దాంతో పోలీసులు హిట్ అండ్ ర‌న్ కింద కేసు న‌మోదు చేసుకున్నారు. ఈరోజు తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ సరిహ‌ద్దులోని కృష్ణా న‌దీతీరాన ఉన్న పొందుగుల గ్రామం ఉంది. భూసేక‌ర‌ణ‌లో భాగంగా.. 4 లేన్ రోడ్డును కాస్తా 2 లేన్‌గా మార్చేసారు. 4 లేన్ రోడ్డుగా ఉన్న‌ప్పుడు అక్క‌డ నివ‌సిస్తున్న 19 కుటుంబాలు త‌మ ల్యాండ్‌ను ఇవ్వ‌బోమ‌ని కోర్టుని ఆశ్ర‌యించారు. దాంతో దానిని 2 లేన్‌గా మార్చేయాల్సి వ‌చ్చింది. అప్ప‌టినుంచి ఈ రోడ్డు యాక్సిడెంట్ల‌కు పేరుగా మారిపోయింది. ఈ రోడ్డులో క‌నీసం డివైడ‌ర్ కూడా లేక‌పోవ‌డం మ‌రో లోప‌మ‌ని పోలీసులు తెలిపారు.