నో బాల్ చెప్పాడ‌ని అంపైర్ దారుణ హ‌త్య‌

స‌ర‌దాగా సాగుతున్న మ్యాచ్‌లో ఒక్కసారిగా దారుణం జ‌రిగింది. నో బ్యాల్ చెప్పినందుకు అంపైర్‌ను దారుణంగా హత్య‌చేసారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది. క‌ట్ట‌క్ జిల్లాలోని మ‌హిసానంద ప్రాంతంలో కొంద‌రు యువ‌కులు గ‌ల్లీ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. ఈ ఆట‌లో ల‌క్కీ రౌత్ అనే 22 ఏళ్ల యువ‌కుడు అంపైర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నాడు. అయితే ఆట మ‌ధ్య‌లో నో బాల్ చెప్పాడ‌ని జ‌ట్టులోని యువ‌కులు అత‌నితో గొడ‌వ‌ప‌డ్డారు. మాటా మాటా పెర‌గ‌డంతో బ్యాట్‌తో దాడి చేసి క‌త్తితో పొడిచేసారు. తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో ల‌క్కీని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించినా ఫ‌లితం లేకుండాపోయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే దాడి చేసిన యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు.