Yatra 2: ఎలెక్ష‌న్ టైంలోనే రిలీజ్.. లేదంటే ఆ డ‌బ్బులు కూడా రావు

Hyderabad: యాత్ర 2 (yatra 2) సినిమాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రిలీజ్ చేయాల‌ని అన్నారు డైరెక్ట‌ర్ మ‌హి వి రాఘ‌వ్ (mahi v raghav). ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (ys jagan ohan reddy) బ‌యోపిక్‌గా ఈ సినిమా రాబోతోంది. 2019లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌గా యాత్ర (yatra) సినిమా తీసారు మ‌హి. అందులో YSR క్యారెక్ట‌ర్‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి (mammootty) న‌టించారు. ఈ సినిమా బాగానే హిట్ టాక్ అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా YSR కొడుకు జ‌గ‌న్ ఎలా పార్టీని న‌డిపించాడు అన్న నేప‌థ్యంలో సినిమాను తీసారు.

ఇందులో త‌మిళ న‌టుడు జీవా (jeeva) జ‌గ‌న్ క్యారెక్ట‌ర్‌లో న‌టించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రిలోనే రిలీజ్ చేయాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు మ‌హి. ఎందుకంటే అప్పుడే ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో తీస్తేనే సినిమాకు డ‌బ్బులు వ‌స్తాయ‌ని లేక‌పోతే వ‌చ్చే ఆ నాలుగు డ‌బ్బులు కూడా రావ‌ని అన్నారు. “చక్రవర్తి శాశ్వతంగా వెళ్లిపోతు ఓ రాజు ని పంపించాడు. ఆ రాజు తన కష్టాల పునాది మీద నిర్మించిన సామ్రాజ్యామే. ఈ “యువజన..శ్రామిక..రైతు కాంగ్రెస్ పార్టీ” అంటూ టీజ‌ర్‌తోనే హైప్ పెంచేసారు మ‌హి. జ‌గ‌న్ పాద‌యాత్ర నుంచి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.