Puri Jagannath: రూ.80 కోట్లు లాగేసుకుంది ఎవ‌రు?

Puri Jagannath: డైన‌మిక్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఎక్కువ‌గా మీడియాతో ఇంట‌రాక్ట్ అవ్వ‌రు. ఆయ‌న‌కు ఉన్న పూరీ మ్యూసింగ్స్ అనే పాడ్ కాస్ట్ ద్వారానే త‌న అభిప్రాయాల‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటారు. అయితే ఇటీవ‌ల పూరీ త‌ల్లి అమ్మాజీ (ammaji) ఇచ్చిన ఇంట‌ర్వ్యూ తెగ వైర‌ల్ అవుతోంది.

ద‌ర్శ‌కుడిలా పేరు తెచ్చుకోవాల‌ని పూరీ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ని కొన్ని రోజుల పాటు కేవ‌లం మంచి నీళ్ల‌తోనే క‌డుపు నింపుకునేవాడ‌ని అప్ప‌టి రోజుల‌ను గుర్తుచేసుకున్నారు. పూరీ ద‌గ్గ‌ర న‌మ్మ‌క‌స్తులుగా ప‌నిచేసేవారే మోసం చేసి దాదాపు రూ.80 కోట్ల వ‌ర‌కు కాజేసార‌ని షాకింగ్ విష‌యాన్ని అమ్మాజీ వెల్ల‌డించారు.

డ‌బ్బు లేక‌పోయినా త‌న ఆస్తుల‌ను అమ్మ‌కానికి పెట్టి సినిమాలు తీయాల‌నుకున్నాడే కానీ ఏనాడూ ఇత‌రుల‌ను మోసం చేసి బ‌త‌కాల‌ని అనుకోలేద‌ని చెప్పి బాధ‌ప‌డ్డారు. అయితే పూరీని మోసం చేసింది ఎవ‌రో ఇండ‌స్ట్రీ మొత్తం తెలుస‌ని ఇప్పుడు పేర్లు చెప్పి వివాదాస్ప‌దం అవ్వాల‌ని అనుకోవ‌డంలేద‌ని అమ్మాజీ తెలిపారు.