Janhvi Kapoor: తిరుమ‌ల‌కు ప్రియుడితో.. అత‌నెవ‌రో తెలుసా?

దివంగ‌త నటి శ్రీదేవి (sridevi) పెద్ద కూతురు జాన్వి క‌పూర్ (janhvi kapoor). ధ‌డ‌క్ (dhadak) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి పాపుల‌ర్ అయిపోయింది. ఇప్పుడు దేవ‌ర‌తో (devara) టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే.. జాన్వి ప్ర‌తి మూడు నెల‌లకోసారి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్తుంటారు. ఆమెతో పాటు చెల్లెలు ఖుషి కూడా వెళ్తుంటారు కానీ చాలా అరుదు. జాన్వితో తిరుమ‌ల ద‌ర్శ‌నంలో ఎక్కువ‌గా క‌నిపించేది శిఖ‌ర్ ప‌హారియా (shikhar pahariya). శిఖ‌ర్ జాన్వి ఎప్ప‌టినుంచో ప్రేమించుకుంటున్నారు.

ఇంత‌కీ ఎవ‌రు ఈ శిఖ‌ర్?

మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి సుషీల్ కుమార్ షిండే మ‌న‌వ‌డే ఈ శిఖ‌ర్. ఇత‌ను ఇప్పుడు వ్యాపారవేత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇత‌నికి పెట్ క‌న్‌స‌ల్టెన్సీ ఫ‌ర్మ్ కూడా ఉంది. అంటే పెట్ ఓన‌ర్స్‌కి కౌన్సెలింగ్ ఇచ్చే సంస్థ ఇది. 2018 శిఖ‌ర్ త‌న త‌మ్ముడు వీర్‌తో క‌లిసి ఇండియా విన్ అనే గేమింగ్ కంపెనీని ప్రారంభించాడు. 2016లో జాన్వి విదేశాల్లో చదువుకుంటున్న‌ప్పుడు శిఖ‌ర్‌ను కిస్ చేస్తున్న ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అప్ప‌టినుంచి వీరిద్ద‌రి డేటింగ్ గురించి బోలెడు వార్త‌లు వ‌చ్చాయి. (janhvi kapoor)

వ‌ద్దన్న శ్రీదేవి

అదే స‌మ‌యంలో శ్రీదేవి జాన్విని బాలీవుడ్‌లో లాంచ్ చేయాల‌న్న ప్లాన్స్‌లో ఉంది. కెరీర్‌పై ఫోక‌స్ చేయాలన్న ఉద్దేశంతో నో డేటింగ్ రూల్ పెట్టిందట శ్రీదేవి. దాంతో అప్ప‌ట్లో వారు విడిపోయారు. శ్రీదేవి చ‌నిపోయాక కొన్ని నెల‌ల్లోనే మ‌ళ్లీ క‌లిసిపోయారు. వీరి ప్రేమ గురించి జాన్వి తండ్రి బోనీ క‌పూర్‌కి తెలుసు. జాన్వి మ‌రిన్ని సినిమాలు చేసి మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకున్నాక అప్పుడు వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు టాక్.