Arundhati Nair: ఘోర ప్ర‌మాదం.. వెంటిలేట‌ర్‌పై ప్ర‌ముఖ న‌టి

Arundhati Nair: ప్ర‌ముఖ త‌మిళ, మ‌ల‌యాళ న‌టి అరుంధ‌తి నాయ‌ర్ ఘోర రోడ్డు ప్ర‌మాదానికి గురయ్యారు. మార్చి 14న త‌న సోద‌రుడితో క‌లిసి బైక్‌పై వెళ్తుండ‌గా కేర‌ళ‌లోని కోవాళం బైపాస్ రోడ్డు వ‌ద్ద వారి బైక్ అదుపు త‌ప్పి ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో అరుంధ‌తి త‌ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. దాంతో ఆమె ప‌రిస్థితి విష‌మంగా మారింది. ప్ర‌స్తుతం ఆమెను వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు అరుంధ‌తి సోద‌రి ఆర్తి వెల్ల‌డించారు. త్రివేండ్రంలోని అనంత‌పురి హాస్పిట‌ల్‌లో అరుంధ‌తి నాయ‌ర్‌ను అడ్మిట్ చేసారు. 2015లో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు అరుంధ‌తి. 2016లో విజ‌య్ ఆంటోనీ న‌టించిన సైతాన్ సినిమాతో అరుంధ‌తి పాపుల‌ర్ అయ్యారు. అరుంధ‌తి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సినీ సెల‌బ్రిటీలు, నెటిజ‌న్లు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.