Sadhguru: “దేవుడే కుప్ప‌కూలిపోయాడ‌నుకున్నాం”

Sadhguru: ప్ర‌ముఖ ఆధ్యాత్మికవేత్త, ఇషా ఫౌండేష‌న్ అధినేత స‌ద్గురు జ‌గ్గీవాసుదేవ్‌కు బ్రెయిన్ స‌ర్జ‌రీ అయిన సంగ‌తి తెలిసిందే. వారం రోజుల క్రితం సద్గురుకు విప‌రీత‌మైన త‌ల‌నొప్పి వ‌చ్చింది. దాంతో ఆయ‌న్ను ఢిల్లీలోని అపోలోకు త‌ర‌లించారు. అక్క‌డి వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. స‌ద్గురు మెద‌డు వాచింద‌ని దాని వ‌ల్ల ఇంట‌ర్న‌ల్ బ్లీడింగ్ అయ్యింద‌ని అన్నారు. వెంట‌నే స‌ర్జ‌రీ చేసారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సెల‌బ్రిటీలు స‌ద్గురు అనారోగ్యంపై స్పందించారు.

ఉపాస‌న: త్వ‌ర‌గా కోలుకోండి స‌ద్గురు. సైన్స్ లాగే న‌మ్మ‌కం కూడా ఎంతో ముఖ్యం

కంగ‌నా ర‌నౌత్: స‌ద్గురుకు బ్రెయిన్ స‌ర్జ‌రీ అని తెలీగానే నాకు కాళ్లు చేతులు ఆడ‌లేదు. విప‌రీత‌మైన త‌ల‌నొప్పి ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న మ‌హాశివ‌రాత్రి వేడుక‌ను నిర్వ‌హించారు. మీటింగ్స్‌, స‌మ్మిట్‌ల‌కి కూడా ఆయ‌న హాజ‌ర‌య్యారు. త్వ‌ర‌గా కోలుకోండి స‌ద్గురూ. మీరే లేక‌పోతే మేం లేము. నేను స‌ద్గురుని బెడ్‌పై చూసాక ఆయ‌న కూడా ఓ మ‌నిషే అని అప్పుడు అర్థం అయ్యింది. అప్ప‌టివ‌ర‌కు నేను ఆయ‌న్ను దేవుడిగా భావిస్తున్నా. దేవుడే కుప్ప‌కూలిపోయిన‌ట్లు అనిపించింది. అని తెలిపారు.