Naresh: ఏపీలో ర‌క్త‌పాతం జ‌రుగుతుంద‌ని అనిపిస్తోంది..!

Naresh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (AP Elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో సీనియర్ న‌టుడు వీకే న‌రేష్ పెట్టిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార బ‌దిలీకి ముందు ర‌క్త‌పాతం జ‌రుగుతుంద‌ని తాను గ‌ట్టిగా న‌మ్ముతున్న‌ట్లు న‌రేష్ ట్వీట్ చేసారు. ఆయ‌న ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ చేసారో ఆయ‌న‌కే తెలియాలి మ‌రి..!

ఐదేళ్ల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ టాపిక్‌ను వాడుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల్లో గెలిచాడ‌ని వివేకా కుమార్తె సునీత ఎప్ప‌టినుంచో ఆరోపిస్తున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు ఎన్నిక‌లు రావ‌డంతో అదే ర‌క్త‌పాతం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని న‌రేష్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.