Virupaksha: ట్రైల‌ర్ డేట్ ఫిక్స్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ తరువాత ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మిస్టికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లేని అందిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో కార్తీక్ దండు అనే కొత్త ద‌ర్శ‌కుడు టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లు, టీజర్ అండ్ గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఒక కొత్త కథని చూడబోతున్నారు అనే ఫీలింగ్ ని కలగజేశాయి. తాజాగా ప్రేక్షకులను మరింత థ్రిల్ కి గురి చేసేందుకు ట్రైలర్ ని తీసుకు వస్తున్నారు.
ఏప్రిల్ 11న ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక ఇంటరెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్ట్ కి సాయి ధరమ్ తేజ్.. ”మీ అంచనాలకు మించి ఉంటుంది. ట్రైలర్ చూసి సర్‌ప్రైజ్ ఫీల్ అవుతారు” అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆడియన్స్ లో ఈ ట్రైలర్ పై మరింత ఆసక్తి పెరిగింది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 16న ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ఎవరు గెస్ట్ గా రాబోతున్నారా? అని అందరు ఎదురు చూస్తున్నారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, రాజీవ్ కనకాల, జాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకం పై ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.