Virupaksha: టీమ్​కి యంగ్​ హీరో స్పెషల్​​ పార్టీ!

Hyderabad: మెగా హీరో సాయి ధరమ్​ తేజ్(Sai Dharam Tej), మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్(Samyuktha Menon)​ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్​ 21న విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి భారీ విజయం సాధించింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా విజయంతో దర్శకుడు కార్తీక్ దండు(Karthik Dandu) ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. కార్తీక్ ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక మిస్టరీ సస్పెన్స్ మిక్స్ చేసిన చిత్రంతో ఆడియన్స్ కట్టిపడేసేలా విరూపాక్ష చిత్రాన్ని తీర్చిదిద్దారు. క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar)​ అందించిన కథ, స్క్రీన్​ప్లే ఈ సినిమాకి చాలా ప్లస్​ అయ్యాయి.

ఇక, తాజాగా టాలీవుడ్​ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) విరూపాక్ష టీంని సర్ప్రైజ్ చేశారు. విరూపాక్ష టీమ్​ మొత్తానికి గ్రాండ్​ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్, కార్తీక్ దండు లకు డీజే టిల్లు హీరో డిన్నర్ పార్టీ ఇచ్చిన ఫొటోని హీరోయిన్​ సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

విరూపాక్ష చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా టీంకి నా శుభాకాంక్షలు.. పాన్ ఇండియా రిలీజ్ కి కూడా ఆల్ ది బెస్ట్ అని సిద్దు జొన్నలగడ్డ సోషల్​ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. డీజే టిల్లుతో సూపర్​ సక్సెస్​ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్​గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్(Tillu2) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్​(Anupama Parameshwaran) టిల్లుకి జోడీగా నటిస్తోంది.