Virupaksha2: విడుదలకు ముందే సీక్వెల్​ ఫిక్స్​!

Hyderabad: కొంత గ్యాప్​ తర్వాత మెగా హీరో సాయి ధరమ్​ తేజ్​(Sai Dharam Tej) నటించిన సినిమా విరూపాక్ష(Virupaksha). ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక, ఈ సినిమాకి క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar) కథని అందించడం విశేషం.​ దీంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ప్రమోషన్స్​లో భాగంగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విరూపాక్ష సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతోందట. సినిమా క్లైమాక్స్ లో కూడా సీక్వెల్ కి సంబంధించి హింట్ ఉంటుందని సమాచారం. ప్రత్యేకంగా ఈ సీన్ కోసమే సాయి తేజ్​తో అదనంగా షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూశాక స్క్రిప్ట్ అందించిన సుకుమార్ బాగా ఇంప్రెస్ అయ్యి సినిమా సీక్వెల్ కి సంబంధించి ఐడియా ఇచ్చారట. సినిమా క్లైమాక్స్ లో దీనికి సంబంధించి ఇంకో సీన్ కూడా ఉంటే బాగుంటుందని సూచించారట. దీంతో చిత్ర బృందం ఈ ఒక్క సీన్ ని మళ్లీ షూట్ చేసిందట.

ఈ సినిమాలో టాలీవుడ్​ లక్కీ ఛార్మ్​ సంయుక్త మీనన్(Samyukta Menon)​ హీరోయిన్​గా నటిస్తోంది. భారీ అంచనాల ఈ సినిమా విడుదల కానుంది. చిత్రబృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సాయి తేజ్ కూడా సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు. ‘పుష్ప 2’(Pushpa2) సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ ‘విరూపాక్ష 2’(Virupaksha2) స్క్రిప్ట్ రాయనున్నారట. ఈ సినిమాకి సుకుమార్​ శిష్యుడు కార్తీక్​ దండు(Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక విరూపాక్ష సినిమాతో సాయి తేజ్ కూడా పాన్​ఇండియా మార్కెట్లో అడుగు పెట్టబోతున్నారు.