Virupaksha: పాన్​ ఇండియా రిలీజ్​ ఫిక్స్​!

Hyderabad: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘విరూపాక్ష’(Virupaksha). ఈ సినిమా ఏప్రిల్​ 21న గ్రాండ్​గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. దర్శకుడు కార్తీక్ దండు(Karthik Dandu) డైరెక్ట్ చేసిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. హార్రర్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్త మీనన్(Samyuktha Menon) సరికొత్త పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది.

హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న కమ్ బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా విరూపాక్ష. సుకుమార్ రైటింగ్స్‌, ఎస్వీసీసీ బ్యానర్లు కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని కార్తీక్ దండు డైరెక్ట్ చేశాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామంటూ ముందుగా మేకర్స్ తెలియజేశారు. కానీ విడుదలకు ముందు తెలుగులో వచ్చిన రెస్పాన్స్ ని బట్టి ఇతర భాషల్లో రిలీజ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు.

ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏయే భాషల్లో ఏ నిర్మాణ సంస్థలు రిలీజ్ చేయబోతున్నాయో ప్రకటించారు మేకర్స్. హిందీలో గోల్డ్ మైన్స్ సంస్థ, తమిళంలో స్టూడియో గ్రీన్, మలయాళంలో E4 ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ లు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే కన్నడలో ఎవరు ఏ సంస్థ విరూపాక్ష థియేటర్ హక్కులు సొంతం చేసుకుందో తెలియజేయలేదు. దీంతో కన్నడలో రిలీజ్ చేస్తున్నారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.