Virupaksha: మెగా హీరో సినిమాలో ఎన్టీఆర్!

Hyderabad: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) చేసిన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘విరూపాక్ష(Virupaksha)’.  ఈ నెల 21 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల  కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​(Sukumar) శిష్యుడు కార్తీక్ దండు(Karthik Dandu) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్​ హీరోయిన్​గా నటిస్తున్న ఈ సినిమాలో అభిమానులకు ఊహించని సర్​ప్రైజ్​ ఉండబోతుందని తెలుస్తోంది.

ప్రమాదం తర్వాత కోలుకుని సాయి ధరమ్​ నటించిన ఈ చిత్రం గ్లిమ్స్ వీడియో కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తారక్​ వాయిస్​తో ఈ గ్లిమ్స్ వీడియో ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది.ఇప్పుడు సినిమాలో కూడా ఎన్టీఆర్​ వాయిస్ ఓవర్ ఉండబోతుందని తెలుస్తోంది. సినిమాలోని  గ్రామం కథ ఎన్టీఆర్ వాయిస్ తో ప్రారంభం అవుతుందట. అయితే తెలుగు ప్రేక్షకులకు సర్​ప్రైజ్​ ఇవ్వడానికే ఈ విషయాన్ని ఇప్పటివరకు బయటకు రాకుండా దాచింది చిత్రబృందం అని తెలుస్తోంది. నిజంగా తారక్​ వాయిస్​ ఓవర్​తో ఈ సినిమా కొనసాగితే అటు మెగా అభిమానులతోపాటు ఇటు నందమూరి అభిమానులకూ పండగే!