Virupaksha: 100 కోట్ల క్లబ్​లో మెగా మేనల్లుడు!

Hyderabad: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), టాలీవుడ్ లక్కీ ఛార్మ్ సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా నటించిన సినిమా ‘విరూపాక్ష’(Virupaksha). ఏప్రిల్ 21న రిలీజైన ఈ సినిమా మొదటి షో నుంచే భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. హార్రర్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలోనూ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar)​ శిష్యుడైన కార్తీక్​ దండు(Karthik Varma Dandu) రూపొందించారు. అంతేకాదు, ఈ సినిమాకి సుకుమార్​ స్క్రీన్​ప్లే అందిచారు. ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్త మీనన్ సరికొత్త పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది. ముందుగు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో.. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు.

ఇక థియేటర్ లో అందర్నీ భయపెట్టిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. సాయి ధరమ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ క్రమంలో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను సాధించింది. ఇప్పటి వరకు సాయిధరమ్ నటించిన ఏ చిత్రం కూడా ఈ ఫీట్ సాధించలేదు. మొత్తానికి తన కెరీర్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి చిత్రం ఇదే కాగా.. సోషల్ మీడియాలో చిన్న గ్లింప్స్ వీడియోతో ఈ వార్తను అఫిషియల్‌గా ప్రకటించారు మేకర్స్. కాగా ‘విరూపాక్ష’ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్(NTR), టీజర్ రిలీజ్ చేసిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) విజువల్స్‌తో పాటు ఆడియన్స్ రెస్పాన్స్‌కు సంబంధించిన క్లిప్పింగ్స్‌తో ఈ గ్లింప్స్ వీడియోను కట్ చేశారు. మొత్తానికి ‘విరూపాక్ష’ కమర్షియల్‌ సక్సెస్ సాధించి సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఈ సినిమా మే 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌(Netflix) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.