Rajinikanth: సినిమా ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి!

Hyderabad: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి(Vamshi Paidipally) కోలీవుడ్​పై దృష్టిపెట్టారు. తాజాగా స్టార్​ హీరో విజయ్(Vijay)​తో వారసుడు(Varasudu) సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌(Rajinikanth)తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్(Dil Raju) రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

టాలీవుడ్​లో బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వంశీ ప్రస్తుతం కోలీవుడ్​ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. తాజాగా వారిసు సినిమాతో కోలీవుడ్​లో హిట్​ కొట్టి మంచి జోష్​లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంశీ, విజయ్ కాంబో మళ్లీ రిపీట్ అవ్వబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అట్లీ, విజయ్ కాంబో లో ఇప్పుడు సినిమా ఖరారు అయ్యింది. దాంతో వంశీ పైడిపల్లి ఇప్పుడు రజనీకాంత్ తో సినిమా మీద దృష్టి పెడుతున్నారు. మరోవైపు దిల్ రాజు మిగతా భాషలలో తన సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ షూటింగ్ పూర్తి చేశాక వంశీ తో సినిమా మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా బలగంతో మంచి హిట్​ అందుకున్న దిల్​ రాజు వరుస సినిమాలను లైన్లో పెట్టారు. దిల్​ రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న శకుంతలం సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. గుణ శేఖర్​(Guna Shekar) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత(Samantha) ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.