Mahesh Babu Trivikram: ఏమైంది గురూజీ…?!

Hyderabad: త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, మ‌హేష్ బాబు (mahesh babu trivikram) కాంబినేషన్‌లో సినిమా వ‌స్తోందంటేనే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆ కాంబో అలాంటిది. త్రివిక్ర‌మ్ టేకింగ్, డైలాగులు.. మ‌హేష్ స్వాగ్, యాక్టింగ్.. అబ్బో మామూలు హైప్ ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో అత‌డు, ఖ‌లేజా వ‌చ్చాయి. అత‌డు (athadu) బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఖ‌లేజా (khaleja) యావ‌రేజ్‌గా ఆడింది. కానీ ఇప్పుడు ఖ‌లేజా సినిమాకు ఉన్న క్రేజే వేరు. రీరిలీజ్ చేస్తే క్ష‌ణాల్లో టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోతాయి. ఇప్పుడు గుంటూరు కారంతో (guntur kaaram) ముచ్చ‌ట‌గా మూడోసారి ర‌చ్చ చేయ‌బోతున్నారు. గుంటూరు కారం అనే టైటిల్, మ‌హేష్ లుక్స్, త్రివిక్ర‌మ్ డైలాగులు, డైరెక్ష‌న్‌.. ఇవి చాలు సినిమా ఏ రేంజ్‌లో ఉండ‌బోతుందో చెప్ప‌డానికి.

కానీ ఏ ముహూర్తాన సినిమాను అనౌన్స్ చేసారో కానీ అన్నీ అడ్డంకులే. ముందు సినిమాలో మహేష్ బాబు, పూజా హెగ్డే (pooja hegde) క‌లిసి న‌టిస్తారు అని అనౌన్స్ చేసారు. కొన్ని రోజుల షూటింగ్ అయ్యాక‌.. పూజా హెగ్డేకు వేరే సినిమాలు ఉండ‌టం వ‌ల్ల డేట్స్ కుద‌ర‌ట్లేద‌ని ఆమెను తీసేస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. ఆ త‌ర్వాత సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేస్తున్న శ్రీలీల‌ను (sreeleea) మెయిన్ హీరోయిన్‌ని చేస్తున్నాం అన్నారు. ఆ తర్వాత శ్రీలీల‌కు సెకండ్ హీరోయిన్ పొజిష‌న్ ఉంచి.. మెయిన్ హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రిని ఎంపిక‌చేస్తున్న‌ట్లు రూమ‌ర్స్ వ‌చ్చాయి. అస‌లు మెయిన్ హీరోయిన్ ఎవ‌ర‌బ్బా అని ఫ్యాన్స్ త‌ల‌బాదుకుంటున్న టైంలో మ‌హేష్‌తో యాక్ట్ చేయ‌డం నా అదృష్టం అంటూ మీనాక్షి సినిమాలో తనే హీరోయిన్ అని ఒక సీన్‌ని లీక్ చేసింది. సో ఇప్పుడు గుంటూరు కారంలో మ‌హేష్ బాబు, మీనాక్షి చౌద‌రి, శ్రీలీల న‌టిస్తున్నారు అన్న క్లారిటీ వ‌చ్చేసింది. (mahesh babu trivikram)

ఇక సినిమా షూటింగ్‌కి ఎలాంటి ప్రాబ్లం ఉండ‌దు అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంద‌ని అని ఫ్యాన్స్ సంతోషించేలోపే ఇంకో పిడుగులాంటి వార్త వ‌చ్చింది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా చేస్తున్న పీఎస్ వినోద్ కుమార్ కొన్ని కార‌ణాల వ‌ల్ల సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యార‌ట‌. త్రివిక్ర‌మ్‌తో వ‌చ్చిన విబేధాల వ‌ల్లే ఆయ‌న త‌ప్పుకున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. దాంతో మ‌ళ్లీ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందో లేదో అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. ఈ గ్యాప్‌లో మ‌హేష్ ఫ్యామిలీతో ఓ ట్రిప్ ఏసి వ‌స్తాన‌ని చెప్పార‌ట‌. (mahesh babu trivikram)

గుంటూరు కారం సినిమా అనే కాదు.. త్రివిక్ర‌మ్, మ‌హేష్ బాబు సినిమా వ‌స్తోందంటేనే ఏదో ఒక స‌మ‌స్య వ‌స్తోంది. గ‌తంలో అత‌డు సినిమా టైంలో కూడా ఎన్నో బ్రేక్స్ వ‌చ్చి షూటింగ్ కంప్లీట్ అవ్వ‌డానికి ఏకంగా రెండేళ్లు ప‌ట్టింది. అఫ్‌కోర్స్ సినిమా బ్లాక్ బ‌స్టర్ అవ‌డం ప్ల‌స్ పాయింట్ అయిందనుకోండి. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఖ‌లేజా కూడా అంతే. సరైన షెడ్యూల్ ప్లానింగ్ లేక‌పోవ‌డంతో సినిమా షూటింగ్‌కి మూడేళ్లు ప‌ట్టింది. ఇప్పుడు గుంటూరు కారంకి కూడా ఇదే ప‌రిస్థితి వ‌చ్చేలా ఉంద‌ని ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. మ‌రోప‌క్క ప్రొడ్యూస‌ర్లు మాత్రం ఏం ఫ‌ర్వాలేదు ఎంత లేట్ చేసినా సినిమా మాత్రం అంచ‌నాల‌ను అందుకుంటుంది అని ఫ్యాన్స్‌ని కూల్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.