The kerala Story: అదా శ‌ర్మ‌కు యాక్సిడెంట్.. బెదిరింపులు!

Hyderabad: ప్ర‌ముఖ న‌టి అదా శ‌ర్మ‌కు(adah sharma) బెదిరింపులు వ‌స్తున్నాయి. వివాదాస్ప‌ద చిత్రంగా మారిన ది కేర‌ళ స్టోరీలో(the kerala story) అదా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈరోజు క‌రీంన‌గ‌ర్‌లో బీజేపీ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గాల్సిన కార్య‌క్ర‌మానికి ది కేర‌ళ స్టోరీ డైరెక్ట‌ర్ సుదీప్తో సేన్ హాజ‌రుకావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో టీం అంతా క‌లిసి కారులో వెళ్తుంటే మైన‌ర్ యాక్సిడెంట్ అయింది. అయితే.. యాక్సిడెంట్ అయిన సంగ‌తి అదా శ‌ర్మ ట్వీట్ చేస్తే తెలిసిందే త‌ప్ప‌.. సుదీప్తో సేన్ మాత్రం వేరే ర‌కంగా ట్వీట్ చేసారు.

టీం అంతా బాగానే ఉన్నాం గ‌య్స్. చిన్న యాక్సిడెంటే అని అదా ట్వీట్ చేస్తే.. త‌న‌కు అనారోగ్యంగా ఉంద‌ని అందుకే క‌రీంన‌గ‌ర్‌లో జ‌రుగుతున్న ఈవెంట్‌కు రాలేక‌పోతున్నాన‌ని సుదీప్తో ట్వీట్ చేసారు. దీనిని బ‌ట్టి చూస్తే అదా శ‌ర్మ‌తో పాటు టీంకు కూడా బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని, అందుకే ఈవెంట్‌కు రావ‌డంలేదని బీజేపీ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక ది కేర‌ళ స్టోరీ సినిమా విష‌యానికొస్తే.. ఈ సినిమాను బీజేపీ త‌ప్ప మ‌రే పార్టీ స‌పోర్ట్ చేయడంలేదు. ఇప్పటికే వెస్ట్ బెంగాల్‌లో సినిమాను బ్యాన్ చేసారు. రెండు రోజుల క్రితం తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ సినిమాల‌ను రిలీజ్ చేసారు. సినిమా కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గలేదు. ఎన్నో వివాదాలను, బ్యాన్‌ల‌ను ఎద‌ర్కొన్న ఈ సినిమా ఇప్ప‌టికే రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది.