Manchu Lakshmi: తెలంగాణ హైకోర్టులో మంచు ల‌క్ష్మికి ఊర‌ట‌

Manchu Lakshmi: తెలంగాణ హైకోర్టులో మంచు ల‌క్ష్మికి ఊర‌ట ల‌భించింది. 2018 జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో మంచు ల‌క్ష్మిపై కేసు న‌మోదైంది. టీవీ 5 ఛానెల్ ప్రెజెంట‌ర్ సాంబ‌శివ‌రావును మంచు ల‌క్ష్మి బెదిరించార‌ట‌. 2018లో మంచు ల‌క్ష్మి టీవీ 5 ఓ యాంక‌ర్‌కు ఇంట‌ర్వ్యూ ఇస్తున్న స‌మ‌యంలో యాంక‌ర్‌కు మంచు ల‌క్ష్మి మధ్య పెద్ద గొడ‌వ చోటుచేసుకుంది. దాంతో యాంక‌ర్ సాంబ‌శివ‌రావు మంచు ల‌క్ష్మిపై కేసు పెట్టాడు. అయితే మంచు ల‌క్ష్మి వివ‌ర‌ణ మ‌రోలా ఉంది. సినీ పరిశ్ర‌మ‌లో హీరోయిన్లు అంతా వేశ్య‌లే అని ఆయ‌న మాట్లాడ‌టం వ‌ల్లే తాను కంట్రోల్ త‌ప్పి మాట్లాడాల్సి వచ్చింద‌ని అన్నారు.