“NTR మాకు అదే చెప్పారు.. త్వ‌ర‌లో అవార్డు తీసుకుంటారు”

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా RRR. ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలై రికార్డులు సృష్టించింది. భారతదేశంతోపాటు పలు దేశాల్లో విడుదలైన RRR సినిమా విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సినిమా సత్తా చాటిన RRR.. కలెక్షన్లతోపాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ బరిలో నిలిచి టాలీవుడ్‌ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న RRR ‌.. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను కూడా దక్కించుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు అవార్డులను కొల్లగొట్టింది.
అయితే, హెచ్‌సీఏ (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్) అవార్డుల కార్యక్రమంలో రాంచరణ్ సందడి చేశారు. స్పాట్ లైట్ అవార్డును సైతం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చరణ్ హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. RRR ‌ సినిమాలో చరణ్, తారక్ హీరోలుగా నటించారని.. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌‌ను పిలవకుండా చరణ్‌ను మాత్రమే పిలవడం ఏమిటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌‌ను నిర్లక్ష్యం చేసి ఏకపక్షంగా వ్యవహరించిందని సోషల్ మీడియాలో హెచ్‌సీఏను ట్రోల్ చేశారు.
దీంతో హెచ్‌సీఏ దీనిపై వివరణ ఇచ్చింది. అవార్డుల కార్యక్రమానికి చరణ్‌తోపాటు జూనియర్ ఎన్టీఆర్‌‌ను కూడా ఆహ్వానించామని స్పష్టం చేసింది. అయితే, ఆయనకు ఇండియాలో షూటింగ్‌లో బిజీగా ఉన్నారని తెలిపింది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్‌‌ తమ నుంచి అవార్డును స్వీకరిస్తారని తెలియజేస్త సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. హెచ్‌సీఏ ఇచ్చిన వివరణతో తారక్ అభిమానులు ఫిదా అయ్యారు. కాగా, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో RRR సినిమాకు పలు పురస్కారాలు దక్కించుకోవడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాంచరణ్‌కు పవర్‌‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్‌‌ పేరును ప్రస్తావించలేదు. దానిపై తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, RRR వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌‌ ఇప్పటివరకు మరో సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్‌‌30 షూటింగ్ మార్చి 5న ప్రారంభం కానుంది. అయితే అదే రోజు ఎన్టీఆర్‌‌ అమెరికా బయలుదేరనున్నట్టు సమాచారం. మార్చి 12వ తేదీన జరగనున్న ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు తారక్ యూఎస్ వెళుతున్నారు. RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్‌‌కు నామినేట్‌ కాగా.. ఈ సూపర్ హిట్‌ పాటకు ఆస్కార్‌‌ అవార్డు వచ్చి తీరుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.