తెలుగు రాష్ట్రాల‌కు సాయం చేసిన తొలి త‌మిళ న‌టుడు

తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు అత‌లాకుత‌లమైన నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ న‌టుడు ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. ప‌క్క రాష్ట్రాల‌కు చెందిన‌వారు మాత్రం ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. బాలీవుడ్ నుంచి కేవ‌లం సోనూ సూద్ సాయం ప్ర‌క‌టించారు. ఇక కోలీవుడ్ నుంచి స్పందించిన ఏకైక న‌టుడు శింబు. ఆయ‌న రెండు రాష్ట్రాల‌కు క‌లిపి రూ.6 ల‌క్ష‌లు సాయం ప్ర‌క‌టించారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు వ‌స్తే మ‌న‌వారు కూడా త‌మ‌కు తోచిన సాయం చేసారు. కానీ ఇప్పుడు మ‌న‌కు క‌ష్టం వ‌స్తే ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కు చెందిన‌వారు ఎవ్వ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.