Manobala: ప్ర‌ముఖ న‌టుడు మ‌నోబాల ఇక‌లేరు

Chennai: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు మ‌నోబాల(manobala) ఇక‌లేరు. కొంత‌కాలంగా లివ‌ర్‌కు సంబంధించిన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ ఈరోజు ఉద‌యం చెన్నైలోని ఓ హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచారు. దాంతో త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగిపోయింది. మ‌నోబాల 1953 డిసెంబ‌ర్ 8న త‌మిళ‌నాడులో జ‌న్మించారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా, క‌మెడియ‌న్‌గా ఎన్నో పాత్ర‌లు పోషించారు. క‌మ‌ల్ హాసన్ ద్వారా త‌మిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన మ‌నోబాల 1979లో పుతియ‌వార్పుగ‌ళ్ అనే సినిమాకు భార‌తీరాజా వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసారు. గ‌జిని సినిమాలో యాడ్ ఏజెన్సీ య‌జ‌మానిగా ఆయ‌న న‌ట‌న ఎంత‌గానో ఆకట్టుకుంది.