Swapna Dutt: తారక్​ మాకు మంచి శకునం!

Hyderabad: RRR సినిమా సూపర్ సక్సెస్​తో గ్లోబల్​ స్టార్​గా మారిపోయారు యంగ్​ టైగర్​ ఎన్టీఆర్(Jr. NTR)​. తారక్​ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా హిట్​ కొట్టింది మాత్రం ‘స్టూడెంట్​ నెం.1’ సినిమాతోనే. దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) రూపొందించిన ఈ సినిమా ఎన్టీఆర్​ కెరీర్​కి టర్నింగ్​ పాయింగ్​గా మారింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్​ వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా, ఈ సినిమా వైజయంతీ మూవీస్​ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్​ నిర్మించారు. అప్పటినుంచీ అశ్వినీ దత్​ కుటుంబానికీ, ఎన్టీఆర్​కి మంచి అనుబంధం ఏర్పడింది.

తాజాగా ఎన్టీఆర్​పై స్వప్న సినిమాస్​ అధినేత అశ్వినీ దత్​ కుమార్తె స్వప్న దత్(Swapna Dutt)​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వప్న సినిమా బ్యానర్​పై నిర్మించిన తాజా చిత్రం అన్నీ మంచి శకునములే. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా మాట్లాడుతూ నిర్మాత స్వప్న దత్​ ఎన్టీఆర్​ గురించి పలు విషయాలు పంచుకున్నారు. ‘స్వప్న సినిమాస్​కు మంచి శకునం తారక్​. ఎన్టీఆర్​ కెరీర్​లో ఫస్ట్​ హిట్​ సినిమాగా నిలిచిన స్టూడెంట్​ నెం.1 మా బ్యానర్లో నిర్మించిన మొదటి చిత్రం. ఇక, అప్పటినుంచీ మా అనుబంధం కొనసాగుతోంది. ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్​ టైంలోనూ తారక్​ను అడగగానే వచ్చారు. మా బ్యానర్లో నిర్మించే ప్రతి సినిమాకి తారక్​ని ఏదో విధంగా అనుబంధం చేయడం మాకు సెంటిమెంట్​గా మారింది’ అంటూ చెప్పుకొచ్చారు స్వప్న.