Rhea: “నీకేం భ‌యం.. నువ్వొక వేశ్య‌వి”

Mumbai:సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushanth Singh Rajput) చనిపోయి మూడు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ సుశాంత్​ చావు వెనక ఉన్న మిస్టరీ వీడలేదు. ఈ కేసులో ప్రధాన నిందుతురాలిగా సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి(Rhea Chakraborthy) అరెస్టయిన సంగతి తెలిసిందే. కాగా, తిరిగి తన కెరీర్​ని స్టార్ట్​ చేస్తూ ‘రోడీస్​(Roadies)’ అనే రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది రియా. ఈ విషయాన్ని స్వయంగా రియా తన సోషల్​ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. “నేను మళ్లీ రాననుకున్నారా? భ‌య‌ప‌డ‌తాన‌నుకున్నారా? ఇప్పుడు భ‌య‌ప‌డ‌టం వేరొక‌రి వంతు” అనింది.

ఈ నేప‌థ్యంలో సుశాంత్​ సోదరి ప్రియాంకా సింగ్(Priyanka Singh)​ చేసిన పోస్ట్​ వైరల్​గా మారింది. ఆ పోస్ట్​లో పేరు చెప్పకుండా ప్రాస్టిట్యూట్(వేశ్య)​ అని సంభోదించింది. “నువ్వెందుకు భ‌య‌ప‌డ‌తావ్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నువ్వు వేశ్య‌వే. కానీ ఇక్క‌డ ప్ర‌శ్న ఏంటంటే.. నీ క‌స్ట‌మ‌ర్లు ఎవ‌రా అని. గొప్ప ప‌లుకుబ‌డి ఉన్న‌వారే నీకు ఇంత ధైర్యాన్ని ఇస్తారు. సుశాంత్ విష‌యంలో న్యాయం ఆల‌స్యం ఎందుకు అవుతోందో తెలుస్తోంది” అని కామెంట్ చేసింది. అయితే ఈ పోస్ట్​ కచ్చితంగా రియా గురించే అంటూ సోషల్​ మీడియాలో చర్చ మొదలైంది.

అయితే తన పోస్ట్​పై వివరణ ఇచ్చింది ప్రియాంక. ‘నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా పోస్ట్​ని కావాలనే తప్పుగా చిత్రీకరిస్తున్నారు. సమాజంలో ఉన్న పరిస్థితుల గురించే రాశాను గానీ ఎవరినీ ఉద్దేశించి కాదు’ అని చెప్పుకొచ్చింది.