Suhana Khan: కోట్ల విలువ చేసే ల్యాండ్ కొన్న షారుక్ కూతురు

Mumbai: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (shahrukh khan) కూతురు సుహానా ఖాన్ (suhana khan) ఏకంగా కోట్లు విలువ చేసే ల్యాండ్ కొనుగోలు చేసింద‌ట‌. అలీబాగ్ ప్రాంతంలో 12 కోట్లు విలువ చేసే భూమి కొన్న‌ట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 1.5 ఎక‌రాల భూమికి సుహానా ఓన‌ర్ అయిపోయింది. న్యూయార్క్‌లో చ‌దువు కంప్లీట్ చేసుకుని ఇండియా వ‌చ్చేసింది సుహానా. ఇప్పుడు బాలీవుడ్ ఫీమేల్ డైరెక్ట‌ర్ జోయా అక్త‌ర్ (zoya akhtar) డైరెక్ట‌ర్ చేస్తున్న అర్చీస్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది సుహానా (suhana). త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ అవ‌బోతోంది. ఇందులో బోనీ క‌పూర్ చిన్న కూతురు ఖుషి క‌పూర్ (khushi kapoor) కూడా న‌టించింది. అయితే సుహానా అన్ని కోట్లు పెట్టి భూమిని ఎందుకు కొనుగోలు చేసింది అని మాత్రం తెలియ‌రాలేదు.