SSMB 29: RRRని మించిపోతుంది..!

Hyderabad: RRR సినిమాతో ఇండియాకు ఆస్కార్ తెచ్చిపెట్టారు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి (rajamouli). ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుతో (mahesh babu) తీయ‌బోయే SSMB 29 సినిమాకు సంబంధించిన ప్లానింగ్‌లో ఉన్నారు. అయితే ఈ సినిమా RRRను మించి బిగ్గెస్ట్ సినిమా అవుతుంద‌ని హైప్ పెంచేస్తున్నారు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ (vijayendra prasad). SSMB 29కు స్క్రిప్ట్ ఆయ‌నే రాస్తున్నారు. ఇదొక అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో రాబోతున్న మూవీ అని రాజ‌మౌళి ఆల్రెడీ ప్ర‌క‌టించేసారు. ఇందులో మ‌హేష్ గ్లోబ్ ట్రాట‌ర్‌గా క‌నిపించ‌బోతార‌ని కూడా అన్నారు.  SSMB 29కోసం మ‌హేష్  (mahesh babu) 3 నెల‌ల పాటు వ‌ర్క్ షాప్‌లో పాల్గొంటార‌ని కూడా విజ‌యేంద్ర ప్ర‌సాద్ తెలిపారు.

ఏద‌న్నా సినిమా స్టార్ట్ చేసేముందు జ‌క్క‌న్న‌..(rajamouli) ఆ సినిమాలోని హీరోతో వ‌ర్క్ షాప్స్ చేయిస్తారు. ఆ వ‌ర్క్ షాప్‌ని బ‌ట్టే ఆ హీరో సినిమాలో చేయ‌గ‌లుగుతాడా లేదా అని నిర్ణ‌యిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది జ‌క్క‌న్న ఆడిష‌న్ స్టైల్‌. ఇక సినిమాలో మ‌హేష్ బాబు క్యారెక్ట‌ర్ హ‌నుమంతుడిని పోలి ఉంటుంద‌ని అంటున్నారు. రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పురాణాల నుంచి ఇన్‌స్పైర్ అయ్యి మ‌హేష్ కోసం ఓ క్యారెక్ట‌ర్ డిజైన్ చేసారు జ‌క్క‌న్న‌. భార‌త సంప్ర‌దాయాల‌కు ఈ సినిమా ద‌గ్గ‌ర‌గా ఉండ‌బోతోంది. సినిమా ఆఫ్రిక‌న్ జంగిల్ అడ్వెంచ‌ర్ ఆధారంగా ఉండ‌బోతోంది కాబ‌ట్టి డ్రామా, ఫైట్స్‌కి అస‌లు కొద‌వే ఉండ‌దు అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా క‌న్ఫామ్ చేసేసారు.