Mahesh Babu: ఇండియాస్‌ బిగ్గెస్ట్ సినిమాగా SSMB29?!

Hyderabad: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (mahesh babu).. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి (rajamouli) కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇదొక గ్లోబ‌ల్ అడ్వెంచ‌ర్ సినిమాలా ఉండబోతోంద‌ని ఆల్రెడీ జ‌క్క‌న్న చెప్పేసారు. మ‌హేష్ లాంటి హీరోతో రాజ‌మౌళి లాంటి డైరెక్ట‌ర్ క‌లిస్తే రిజ‌ల్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఫ్యాన్స్‌కి ఆల్రెడీ అర్థ‌మైపోయే ఉంటుంది. అయితే.. వీరి సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపిక ప‌దుకొణె (deepika padukone) హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ట‌. అంతేకాదు.. సినిమాలో విల‌న్‌గా ఆమిర్ ఖాన్ (aamir khan) న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేష‌న్‌తో SSMB29 సినిమా ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా కాబోతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల సమాచారం.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్‌లో రాజ‌మౌళి బిజీగా ఉన్నారు. 2024 స‌మ్మ‌ర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సినిమాలో ఎక్కువ‌గా వీఎఫ్ఎక్స్ ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇందులో మ‌హేష్ ఇదివ‌ర‌కు ఎప్పుడూ చేయ‌ని యాక్ష‌న్ సీన్స్‌లో న‌టిస్తార‌ని కూడా జ‌క్క‌న్న ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం మ‌హేష్‌.. త్రివిక్ర‌మ్‌తో క‌లిసి గుంటూరు కారం (guntur karam) సినిమాలో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పూజా హెగ్డే (pooja hegde) హీరోయిన్‌గా న‌టిస్తోంది.