SS Rajamouli: ‘మేం ఫేమస్​’ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా!

Hyderabad: సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas), మణి ఎగుర్ల, మౌర్య చౌదరి ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం మేం ఫేమస్(Mem Famous). ఛాయ్ బిస్కెట్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇక హీరోగా నటించిన సుమంత్ ప్రభాసే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. గతంలో పిల్ల పిల్లగాడు అనే వెబ్ సిరీస్ తో సుమంత్.. మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సిరీస్ తరువాత.. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసిన సుమంత్.. మొదటి సారి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మే 26 న విడుదలై పాజిటివ్​ టాక్​తో దూసుకుపోతోంది. కాగా, ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

మేం ఫేమస్​ సినిమా చూసిన సూపర్​స్టార్​ మహేష్​బాబు(Mahesh Babu) సోషల్​ మీడియా వేదికగా చిత్రబృందాన్ని అభినందించిన విషయం తెలిసిందే. అంతేకాదు సుమంత్​ ప్రభాస్​ తదుపరి సినిమాను తానే నిర్మిస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఇక, తాజాగా దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) కూడా ఈ చిత్రబృందాన్ని మెచ్చుకోవడమే కాకుండా, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని సర్ట్​ఫికెట్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత సినిమా పూర్తిగా ఎంజాయ్​ చేశాననీ, సుమంత్​ ప్రభాస్​కి మంచి భవిష్యత్​ ఉందని అన్నారు. ఈ సినిమాలో నటించిన అంజిమామను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.