SS Rajamouli: భార‌తీయ సినిమాపై బ‌యోపిక్..!

ఇప్ప‌టివ‌ర‌కు ఎంద‌రో బ‌యోపిక్‌ల‌ను చూసాం. ఇప్పుడున్న ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు ప్ర‌ముఖుల జీవితాధారంగా బ‌యోపిక్‌లు తీస్తుంటే.. నేను ఆ బ‌యోపిక్‌ని చూపించే భార‌తీయ చ‌ల‌న చిత్రంపై బ‌యోపిక్ తీస్తానంటూ ముందుకొచ్చారు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి (ss rajamouli). మేడ్ ఇన్ ఇండియా టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమాను నితిన్ క‌క్క‌ర్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ ప్రొడ్యూస‌ర్. రాజ‌మౌళి సినిమాను స‌మ‌ర్పిస్తున్నారు. అస‌లు భార‌తీయ చ‌ల‌న చిత్రం ఎలా పుట్టింది అనే విష‌యాల‌ను ఈ బ‌యోపిక్‌లో చూపించ‌బోతున్న‌ట్లు జ‌క్క‌న్న ప్ర‌క‌టించారు.