“రియల్”​ హీరోపై అభిమానుల ప్రేమ!

Madhya Pradesh: సోనూ సూద్(snonu sood).. రీల్​లో విలన్​ అనిపించుకున్నా, రియల్​గా తన సేవలతో దేశమంతటా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా కరోనా(Corona) సమయంలో సోనూ(Sonu Sood) అందించిన సేవలు చాలామంది పేదలకు ఆసరాగా నిలిచాయి. కాగా మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని కొందరు అభిమానులు సోనూ సూద్పై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.
సినిమాల్లో విలన్ గా నటించి అందర్నీ భయపెట్టిన సోనూ సూద్ (Sonu Sood) రియల్ లైఫ్ లో మాత్రం అందరికి దేవుడు అవుతున్నాడు. తన తల్లిపేరున ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఎందరో పేదలకు అండగా నిలుస్తున్నాడు.
ఇక ఆ సేవలను గుర్తించి పలువురు సోనూ సూద్(sonu sood) ని అభినందిస్తూ సత్కరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని కొందరు అభిమానులు సోనూ సూద్ పై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఒక ఎకరం స్థలంలో 2500 కేజీల బియ్యంతో సోనూ సూద్ రూపాని తీర్చిదిద్దారు. మధ్యప్రదేశ్ దేవాస్ లోని తుకోజీరావు పవార్ స్టేడియంలో నెల పై నల్లటి ప్లాస్టిక్ షీట్ ని పరిచి దాని బియ్యంతో సోనూ సూద్ రూపాన్ని ఆవిష్కరించారు.
కాగా ఈ ఆవిష్కరణకి ఉపయోగించిన బియ్యం మొత్తాన్ని అవసరం ఉన్న వారికి దానం చేయనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ మొత్తం ఆవిష్కరణని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యి సోనూ సూద్ కి వరకు చేరుకుంది. దీనికి సోనూ(Sonu Sood) రియాక్ట్ అవుతూ.. ‘మీరు చూపిస్తున్న ప్రేమకి నాకు మాటలు కూడా రావడం లేదు’ అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.