Sobhita Dhulipala: నా పిల్ల‌ల‌కు వీళ్లే అవెంజ‌ర్స్ అని చెప్తా

Sobhita Dhulipala talks about her kids

Sobhita Dhulipala: మ‌ణిర‌త్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 రిలీజ్ అయ్యి అప్పుడే రెండేళ్లు అయిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇందులో వాన‌తి పాత్ర‌లో న‌టించిన శోభిత ధూళిపాల‌.. పొన్నియిన్ సెల్వ‌న్ న‌టీన‌టుల‌తో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేసాను. త‌న‌కు పిల్ల‌లు పుట్టాక వీరే అవెంజ‌ర్స్ అని చెప్తాను అని వెల్ల‌డించారు. పొన్నియిన్ సెల్వ‌న్‌లో విక్ర‌మ్, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్, ఐశ్వర్య ల‌క్ష్మి, శోభిత ధూళిపాల‌, జ‌యం ర‌వి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అయ్యింది. అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ అయిన‌ప్ప‌టికీ మాతృ భాషైన త‌మిళంలోనే మంచి క‌లెక్ష‌న్లు, రికార్డులు నెల‌కొల్పింది. ఇటీవ‌ల జ‌రిగిన సైమా అవార్డుల కార్య‌క్ర‌మంలో ఐశ్వ‌ర్య రాయ్ ఉత్త‌మ న‌టికి గానూ.. విక్ర‌మ్ ఉత్త‌మ న‌టుడిగానూ అవార్డులు అందుకున్నారు.