Shyamala: జ‌గ‌న్ అన్న మ‌ళ్లీ వ‌స్తాడు

shyamala says ys jagan mohan reddy will be back again

Shyamala: రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌, యాంక‌ర్ శ్యామ‌ల‌. పిఠాపురంలో వంగ గీత త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన శ్యామ‌ల కాస్త ఓవ‌రాక్ష‌న్ చేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అర‌వ‌డం.. ఆవేశంతో ఊగిపోవ‌డం చూసాను కానీ సాయం చేయ‌డం ఎప్పుడూ చూసింది లేద‌ని వ్యాఖ్యానించారు. వంగ గీత గెలుపు ఆల్రెడీ నిశ్చ‌యం అయిపోయింద‌ని.. తాను ప్ర‌చారంలో పాల్గొంటే కాస్త మెజారిటీ వ‌స్తుందేమో అని ఆమె త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నార‌ని ప్ర‌గల్భాలు ప‌లికారు.

తీరా పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అంటూ శ్యామ‌ల ఓ వీడియో పెట్టారు. “” రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. గెలిచిననాడు పొంగిపోలేదు, ఓడిన నాడే కాదు ఏనాడూ కుంగిపోయింది లేదు. మళ్లీ పుంజుకొని మా నాయకుడు జగన్ అన్న ఆధ్వర్యంలో తిరిగి లక్ష్యాన్ని సాధించడానికి రెట్టింపు పని చేస్తాం. మీ నాయకుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారు చెప్పారు ఎవరి మీద నోరు జారొద్దు అని ఆ సందేశాన్ని మీరు పాటిస్తారు అని కోరుకుంటున్నాను “” అని తెలిపారు.