Sharwanand: పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన శ‌ర్వానంద్ దంప‌తులు

Sharwanand: ప్ర‌ముఖ న‌టుడు శ‌ర్వానంద్, ర‌క్షితా రెడ్డి దంప‌తులు పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చారు. పాప‌కు లీలాదేవి మైనేని అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు శ‌ర్వా వెల్ల‌డించారు. పాప‌, భార్య‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. శ‌ర్వానంద్‌, ర‌క్షిత రెడ్డిల వివాహం గ‌తేడాది జూన్‌లో రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ర‌క్షితా రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేసేవారు. ఇక‌పోతే.. శ‌ర్వానంద్ త‌న 35వ సినిమాతో బిజీగా ఉన్నారు. మ‌న‌మే (Maname) అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే.. ఈరోజు శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు. అందుకే ఆయ‌న కొత్త సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని కూడా రిలీజ్ చేసారు. త‌న జీవితంలోకి అడుగుపెట్టిన మ‌హాల‌క్ష్మి గురించి ఈరోజే ప్ర‌క‌టించాల‌ని అనుకున్నార‌ట‌.