Malli Pelli: పెళ్లెందుకు.. మా మ‌న‌సులు క‌లిసాయిగా..!

Hyderabad: ప్ర‌ముఖ న‌టుడు న‌రేష్‌(naresh).. ప‌విత్ర లోకేష్(pavitra lokesh) పెళ్లి చేసుకోబోతున్నారా(malli pelli) లేదా చేసేసుకున్నారా అనే అంశంపై టాలీవుడ్‌లో ఎప్ప‌టినుంచో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో న‌రేష్‌, ప‌విత్ర క‌లిసి మ‌ళ్లీ పెళ్లి(malli pelli) అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఈరోజు సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసారు. చూడ‌బోతే.. ఈ సినిమా న‌రేష్ బ‌యోపిక్‌లా అనిపిస్తోంది. ట్రైల‌ర్‌లో చిన్న‌ సూప‌ర్‌స్టార్‌, పెద్ద సూప‌ర్‌స్టార్ అంటూ ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం గురించి కూడా ప్ర‌స్తావించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ట్రైల‌ర్ రిలీజ్ టైంలో ఓ జ‌ర్న‌లిస్ట్‌.. న‌రేష్‌ని సూటి ప్ర‌శ్న అడిగారు. మీరు, ప‌విత్ర పెళ్లి చేసుకున్నారా? చేసుకోబోతున్నారా? అని. ఇందుకు న‌రేష్ స్పందిస్తూ.. “అస‌లు ఈ రోజుల్లో వివాహ వ్య‌వ‌స్థ అనేదే చ‌చ్చిపోయింది. ఇప్పుడు ఐదు, ఆరు ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయంటే ఆ వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోతోంది అనే అర్థం. ఆ వ్య‌వ‌స్థ‌పై ఉన్న గౌర‌వంతోనే ఈ సినిమా చేసాం. పెళ్లి అంటే కొంద‌రు ఉంగ‌రాలు మార్చుకుంటారు, తాళి క‌డ‌తారు. కానీ మా మ‌న‌సులు క‌లిసాయి క‌దా. పెళ్లంటే రెండు మ‌న‌సులు క‌ల‌వ‌డ‌మే” అంటూ ప‌విత్రతో త‌న‌కు రిలేషన్ ఉంద‌ని ఇన్‌డైరెక్ట్‌గా ఒప్పేసుకున్నారు న‌రేష్‌.