Samyuktha: రెమ్యునరేషన్​ పెంచేసిన టాలీవుడ్​ గోల్డెన్​ ఛార్మ్​!

Hyderabad: భీమ్లా నాయక్​(Bheemla Nayak), బింబిసార(Bimbisara), సార్(Sir)​, విరూపాక్ష(Virupaksha).. వరుస హిట్లతో దూసుకుపోతోంది మలయాళ కుట్టీ సంయుక్తా మీనన్(Samyuktha Menon)​. ప్రస్తుతం టాలీవుడ్​ హీరోయిన్లలో సంయుక్త మీనన్ బెస్ట్ ఛాయిస్​గా కనిపిస్తోంది. పూజా హెగ్డే, రష్మికా మందాన లాంటి స్టార్ హీరోయిన్లు భారీ పారితోషకాలు డిమాండ్ చేస్తుండటంతో దర్శకనిర్మాతలు సంయుక్తకి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇక, తాను నటించిన సినిమాలన్నీ సూపర్​ హిట్​లుగా నిలవడంతో సంయుక్త టాలీవుడ్​ గోల్డెన్​ లెగ్​గా మారిపోయింది. తాజాగా సాయి ధరమ్​ తేజ్​ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష హిట్​తో సంయుక్త క్రేజ్​ మరింత పెరిగిపోయింది. ఇక, ఈ క్రేజ్​ని దృష్టిలో ఉంచుకుని ఈ భామ రెమ్యునరేషన్​ కూడా బాగా పెంచినట్లు తెలుస్తోంది.

విరూపాక్ష తర్వాత సంయుక్త నటిస్తున్న డెవిల్ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కల్యాణ్ రామ్ తో సంయుక్త నటిస్తున్న రెండో సినిమా ఇది. పోయినేడాది కన్నడలో గాలిపట 2తో శాండల్ వుడ్ లోకి లాంచ్ అయిన సంయుక్తకు అక్కడి కంటే ఇక్కడే క్రేజీ ఆఫర్లు ఎక్కువగా అందుతున్నాయి. అవకాశాలు వస్తున్న కారణమో లేక విరూపాక్ష సూపర్ హిట్ అయినందునో తెలీదు కానీ.. సినిమా నిర్మాతలకు షాకిస్తోంది సంయుక్త.  టాలీవుడ్​ గోల్డెన్​ ఛార్మ్​గా పాపులర్​ అయిన సంయుక్త రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని ఇండస్ట్రీ టాక్. వరుసగా నాలుగు సినిమాలు హిట్‌ అయ్యాయి గనుక అక్షరాలా కోటి రూపాయల పారితోషకం అడుగుతోందట. ప్రస్తుతం కల్యాణ్‌రామ్(Kalyan Ram) సరసన చేస్తున్న డెవిల్(Devil) సినిమా కూడా హిట్ అయితే ఈ భామ దక్షిణాది స్టార్​ హీరోయిన్ల జాబితాలో చేరిపోయినట్టే.