‘నా జీవితం ఏం మారలేదు’

టాలీవుడ్​లో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిలకడగా రాణిస్తున్న హీరోయిన్​ సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టారు. అనారోగ్యంతో కొన్నాళ్లు గ్యాప్​ తీసుకున్న సమంత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా పూర్తి చేసిన సామ్ ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఏప్రిల్​ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతోంది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కావున ప్రమోషన్స్​ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సామ్​.
పాన్ ఇండియా స్టార్​గా మారాక తన జీవితంలో వచ్చిన మార్పులపై స్పందించారు సమంత. ‘నేను పాన్​ ఇండియా స్టార్​ని అనే విషయం మా ఇంట్లో పెంపుడు జంతువులకు ఎవరైనా చెబితే బాగుంటుంది. అందరూ అనుకున్నట్లు నా జీవితం ఏం మారలేదు. ఆరు గంటల వరకే నేను సెలబ్రెటీని. ఆ తర్వాత అందరిలానే మామూలు మనిషిని. ఆరు దాటితే నా జీవితం సాదాసీదాగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు సామ్​.
గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న శాకుంతలం చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, గౌత‌మి, మ‌ధుబాల‌, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా.. ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. సమంత కెరీర్ లో వస్తున్న తొలి పౌరాణిక సినిమా ఇదే కావడం విశేషం. నీలిమ గుణ, దిల్ రాజు నిర్మాతలుగా ఈ సినిమాను రూపొందించారు. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శాకుంతలం మూవీలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తుండటం విశేషం. ఈ మూవీతో అల్లు అర్హ మొదటిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరోవైపు రాజ్- డీకే తెరకెక్కిస్తున్న సిడాటెల్ వెబ్ సిరీస్ కోసం షూటింగ్​లోనూ పాల్గొంటున్నారు సమంత. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో సమంత యాక్షన్ మోడ్ అబ్బురపరచనుందని సమాచారం.
అంతేకాదు విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు సామ్​. గతంలో మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించారు. ఇప్పుడు అదే జోడీ మళ్ళీ ఖుషి సినిమాతో వస్తుండటం, అది కూడా ఫీల్ గుడ్ ప్రేమకథ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఓ రకమైన ఆసక్తి నెలకొంది. మొత్తం మీద సామ్ అనారోగ్యాన్ని జయించి​ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవడం చాలామందిలో స్ఫూర్తి నింపుతోందటున్నారు అభిమానులు.