Virupaksha: ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్!

Hyderabad: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’(Virupaksha). ఏప్రిల్​ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజై బ్లాక్​ బస్టర్​ టాక్​ని అందుకుంది. ఈ సినిమాకు క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar)​ కథ, స్క్రీన్​ప్లే అందించగా ఆయన శిష్యుడు కార్తీక్ దండు(Kartik Dandu) దర్శకుడిగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ సాలిడ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలోని థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమా తాజాగా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ‘విరూపాక్ష’ డిజిటల్ రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ పార్ట్‌నర్‌గా మారింది.

ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్(Samyukta Menon) హీరోయిన్‌గా నటించగా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా సక్సెస్​పై సోషల్​ మీడియా వేదికగా మెగాస్టర్​ చిరంజీవి(Chiranjeevi) సంతోషం వ్యక్తం చేశారు. తన మేనల్లుడికి అభినందనలు తెలిపారు.