Sai Dharam Tej: అమ్మాయిలంటే భయం!

Hyderabad: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించనున్నారు. 2021 అక్టోబర్​లో రిలీజైన్​ ‘ రిపబ్లిక్(Republic)’ తర్వాత యాక్సిడెంట్​ వల్ల కొంచెం గ్యాప్​ తీసుకున్నారు సాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్​( Sai Dharam Tej) నటించిన విరూపాక్ష(Virupaksha) విడుదలకు సిద్ధమైంది. టాలీవుడ్ లక్కీ ఛార్మ్​ సంయుక్త మీనన్(Samyukta Menon)​ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, ప్రేమ విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

విరూపాక్ష సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయి మాట్లాడుతూ.. ‘గతంలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. కొన్ని కారణాలతో ఆమెతో బ్రేకప్ అయ్యింది. అప్పటి నుండి నాకు అమ్మాయిలు అంటే భయం. ప్రేమలో విఫలం చెందాక నేను సైలెంట్ అయిపోయాను. మళ్ళీ అమ్మాయిల జోలికి పోలేదు’ అన్నారు. మరి పెళ్లి చెప్పుడు చేసుకుంటారని అడిగితే.. ‘ఒకరు చెప్పారని నేను పెళ్లి చేసుకోను. నాకు నచ్చినప్పుడు, ఇష్టమైనప్పుడు మాత్రమే చేసుకుంటాను’ అన్నారు. సాయి ధరమ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.