Sai Dharam Tej: తప్పు చేశాను.. క్షమించండి!

Eluru: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్(Samyuktha Menon) జంటగా నటించిన సినిమా విరూపాక్ష(Virupaksha). కొత్త డైరెక్టర్​ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్​ను ఏప్రిల్ 16న ఏలూరులో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్​లో మాట్లాడుతూ తేజ్ ఎమోషనల్ అయ్యాడు. యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాక తాను అనుభవించిన బాధలను పంచుకున్నాడు. తన తల్లి, తమ్ముడుకు సారీ, ఐ లవ్ యూ చెప్పిన తేజ్.. తరువాత ప్రేక్షకులకు క్షమించమని కోరాడు. బైక్ నడపడమంటే తనకు ఇష్టమని, బైక్ మీద నుంచి కాలుజారి పడ్డాకా తాను చూసే విధానం మొత్తం మారిందని చెప్పుకొచ్చాడు. తాను తప్పు చేశానని, అభిమానులను చాలా కంగారు పెట్టినందుకు తనను క్షమించమని కోరాడు.

యాక్సిడెంట్​ తర్వాత విరూపాక్ష ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో మొదటిసారి మాట్లాడాడు తేజ్​. ఈ సందర్భంగా తేజ్​ మాట్లాడుతూ కెరీర్​లో ఎన్నో ఒడిదొడుకుల తర్వాత జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఈ యాక్సిడెంట్ మళ్లీ తనను కిందపడేసిందని, అయినా ప్రేక్షకుల ప్రేమ కోసం, అభిమానుల ఆనందం కోసం ఎంతవరకైనా వెళ్తానని, తనకు అభిమానుల ప్రేమ ఇలాగే కావాలని దానికోసం ఎంత కష్టమైన అనుభవిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక తనను కాపాడింది హెల్మెట్ అని.. దయచేసి అందరూ హెల్మెట్ వాడాలని సూచించాడు సాయి ధరమ్​ తేజ్​.