Naga Chaitanya: చై త‌న త‌ల్లితో ఎందుకు క‌లిసి ఉండ‌టం లేదు?

Naga Chaitanya: అక్కినేని నాగ‌చైత‌న్య త‌న త‌ల్లి ల‌క్ష్మితో క‌లిసి ఉండ‌రు. ఆయ‌న హైద‌రాబాద్‌లో త‌న‌కంటూ ఓ విల్లా తీసుకుని అక్క‌డే ఉంటున్నారు. అప్పుడప్పుడు త‌న తండ్రి అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లి వ‌స్తుంటాడు. అయితే నాగార్జున మొద‌టి భార్య ల‌క్ష్మితో విడిపోగా.. చైత‌న్య త‌న త‌ల్లితో క‌లిసి ఉండ‌టం లేదు. ఇందుకు రెండు కార‌ణాలు ఉన్నాయి.

ఒక‌టి.. ల‌క్ష్మి సుంద‌రం మోట‌ర్స్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అయిన శ‌ర‌త్ విజ‌య‌రాఘ‌వ‌న్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారు. అక్క‌డ ల‌క్ష్మి ఇంటీరియ‌ర్స్ పేరుతో వ్యాపారం పెట్టుకున్నారు. అయితే నాగ‌చైత‌న్య టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇక్క‌డే సినిమాలు చేసుకోవాలి కాబ‌ట్టి అప్పుడ‌ప్పుడు అమెరికాలోని త‌న త‌ల్లి వ‌ద్ద‌కు వెళ్లి వ‌స్తుంటాడు. అందుకే చైతూ త‌న త‌ల్లితో క‌లిసి ఉండ‌టం లేద‌ట‌. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య తండేల్, ధూత 2 సినిమాల‌తో బిజీగా ఉన్నారు.